నిడమానూరి సాంబశివరావు కు నివాళులర్పించిన రావు సుబ్రహ్మణ్యం
బీసీలకు అండగా నిలిచిన గొప్ప నేతను కోల్పోవడం బాధాకరం అన్నారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు

బీసి నేత నిడమానూరి సాంబశివరావు పార్దీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం. చిలకలూరిపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు నిడమానూరి సాంబశివరావు శనివారం ఉదయం మృతి చెందారు.24.07.2022 ఆదివారం ఉదయం 9 గంటల సమయం లో చిలకలూరిపేట లోని ఆయన స్వగృహంలో సాంబశివరావు పార్దీవదేహానికి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు.బీసీలకు అండగా నిలిచిన గొప్ప నేతను కోల్పోవడం బాధాకరం అన్నారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.నివాళులు తెలిపే కార్యక్రమంలో న్యూ మాంక్స్ కుంగ్ ఫు గ్రాండ్ మాస్టర్ ఎస్కె కమాల్ బాషా, రావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.