వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా అన్నమయ్య వ్రాసిన అమ్మవారి కీర్తన

సర్వాంగ సుందరుడు, శ్యామలాంగుడు అయిన ఆ వేంకటేశ్వరుడినే తన జాణతనములతో కొంగున కట్టుకుని అతని వక్షస్థలంలో స్థిరంగా నిలిచిపోయింది తల్లి

Aug 20, 2021 - 09:23
 0

పల్లవి: అలమేలుమంగ నీవభినవరూపము జలజాక్షుకన్నులకు చవులిచ్చేనమ్మా

చరణం 1:

గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి పరమానంద సంభరితవై

నెరతనములు చూపి నిరంతరము నాథుని హరుషించఁగఁ జేసితి గదమ్మా

చరణం 2:

శశికిరణములకు చలువల చూపులు విశదముగా

మీఁద వెదచల్లుచు రసికత పెంపునఁ గరఁగించి యెప్పుడు

నీ- వశము చేసుకొంటి వల్లభునోయమ్మా

చరణం 3:

రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు

పట్టపురాణివై పరఁగుచు

వట్టిమాఁకులిగిరించు వలపుమాటల

విభు జట్టిగొని వురమున సతమైతివమ్మా

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow