రెండవరోజు వైదిక చరిత్ర-శిక్షణ శిబిరం గుంటూరు - ఆచార్య మోహనరావు శర్మ
తప్పు చేస్తున్నారు.. - విశ్వకర్మ వ్రతం చేయాలి.. విశ్వకర్మ జయంతి కాదు , మహేంద్ర మోక్షం మీకు చెప్పినది వేరు, వాస్తవము వేరు, జాగరూకులు కండి ... శ్రీ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ

నమో విశ్వకర్మణే అంటూ , ప్రశాంతం గా ప్రారంభమైన రెండవరోజు " వైశ్వకర్మణ వైదిక చరిత్ర , త్రికాల సంధ్యా వందన - ఉచిత శిక్షణ శిబిరం " . రెండవ రోజు శిభిరం ఆహ్వానితులు, శిభిర నిర్వాహక సారధి శ్రీ విశ్వకర్మ వాస్తు జ్యోతిష్య నిలయ నిర్వాహకులు , ప్రముఖ సిద్ధాంతి, శ్రీ N.N మల్లేశ్వర రావు MA,MCOM,LLB గారు. మరియు శిబిరగురువులు - శ్రీ శ్రీ వేదబ్రాహ్మశ్రీ ఆచార్య మోహన రావు శర్మ గారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి ప్రత్యేక మరియు ఆకస్మిక, మరియు హఠాత్ దర్శనం లా తలపించే విధంగా ప్రముఖ వేద స్మార్త పండితులు, శైవాగమ ప్రవర మరియు తెనాలి విశ్వా బ్రాహ్మణ వేద పాఠశాల గురు వర్యులు అయిన శ్రీ జనార్ధన శివాచార్య గారు హాజరయ్యారు,
శ్రీ జనార్ధన శివాచార్య గారిని గురు మన్యతః మరియు పండిత పూజ్య సమభావ సత్కారాలతో శ్రీ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారు మరియు శిభిరం ఆహ్వానితులు, శ్రీ N.N మల్లేశ్వర రావు గారు గౌరవించారు.
తదన్తరం శ్రీ జనార్ధన శివాచార్య గారు శ్రీ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారి పాండిత్య విశేషాలను మరియు వారి గొప్ప తనాన్ని సభ ముఖంగా ప్రశంసించారు . మరియు ఇంతటి సత్కార్యాన్ని చేస్తున్న శ్రీ N.N మల్లేశ్వర రావు గారిని ఆశీర్వదిస్తూ మీరు ఇంకా ఎన్నో సత్కార్యాలు చేయాలనీ , మీ ఇరువురి శ్రమకు విశ్వబ్రాహ్మణ సమాజం ఏమిచ్చినా ఋణం తీరదని సెలవిచ్చారు .
ఈ రోజు వైశ్యకర్మణ వైదిక చరిత్ర ఉచిత శిక్షణ తరగతి నేపథ్యం లో రెండవ రోజు జరిగిన తరగతి లో విశ్వ సృష్టి ప్రారంభం ఏ విధంగా జరిగింది, దానిని పరమాత్మ విశ్వకర్మ ఏ విధంగా పంచ భూతాలను ఉపయోగించుకొని సృష్టించాడని,మరియు కృష్ణ యజుర్వేదం లోని వేదమంత్రం( 7-5-1) లో చెప్పిన విందంగా కొన్ని వేద మంత్రాలను ఉదహరిస్తూ, శిబిర గురువైన శ్రీ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారు సవివరముగా శిబిరార్డులు కు బోధనలు చేశారు .
ఈ వైశ్యకర్మణ , వైదిక ఉచిత శిక్షణ తరగతి కార్యక్రమము ఆద్యన్తమనూ కూడా ఆహ్లాద కరంగా మరియు ఉత్తేజ భరితం గ ఇంకా చెప్పాలంటే బహు ఆశక్తి కరంగా సాగింది.
శిబిరార్డులు కూడా చాల చురుగ్గా గురువు గారి పై (శ్రీ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారు) గౌరవ పూరిత ప్రశ్నల వర్షం తో వర్షం కురిపిస్తూ జాగరూకతతో పాల్గొన్నారు. మొత్తంగా శిబిరార్డులు సృష్టి రహస్యాన్ని తెలుసుకోవటం జరిగింది .
దాని తరువాత భువన విశ్వకర్మ మరియు బౌనవిశ్వకర్మ వార్లు మన భూమండలాన్ని పరిపాలించిన చక్ర వర్తులు అని, వారి పరిపాలనా కాలం లో దేవ మనుష్య,గంధర్వ , యక్ష మొదలగు గనాధులు మరియు ఇతరత్రా గనాధులు కూడా భూమండలం పై సహనా వవతు అన్న రీతిన ఒకేచోట నివసించేవారు అని, దేవతలు వేరుగా స్వర్గ లోకం లో ఉండేవారు కాదని చెప్పారు .
పూర్వకాలమున ఒకానొక సమయములో దేవతలు త్వష్ట ప్రజాపతి వద్దకు వెళ్లి , మానవులు భూసార రుచి ప్రభావితం చేత వారి మనసులలో కలిగిన మార్పుల వలన దేవతలు ప్రత్యేక లోకాదులు కావాలని కోరారు అని, వీరి కోరిక మేరకు ప్రజాపతి, త్వష్ట విశ్వ కర్మను ప్రార్ధించగా , ఆయన పరమాత్మ విశ్వ కర్మ సాయంతో , వీరికి రకరకాల (14) లోకాలు సృష్టి చేసి వారికీ ప్రసాదించారని సెలవిచ్చారు . ( ఇది సత్య యుగ అంత్య దశ నందు ఇది జరిగినదని వివరించారు .
మనకు తెలిసిన మహేంద్ర మోక్షము కథను మునుపెన్నడూ వినని రీతిన శ్రీ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారు సెలవిచ్చారు. ఇదే సందర్భం లో మొట్టమొదట శ్రీ విశ్వకర్మ వ్రతమును మరియు యాగమును చేయించింది మరియు దేవ, మానవాది ఘనాలకు తెలియ పరచింది భౌవన విశ్వ కర్మ అని తెలియ పరిచారు .
మహేంద్రుడు విశ్వరూప చార్యులను మరియు వృత్రుడు ని సంహరించినపుడు సోకిన బ్రహ్మ హత్యా పాతకమును పోగొట్టుకొనడానికి విశ్వకర్మ యాగము రెండవ సారి చేశారని. భౌవన విశ్వకర్మ తపస్సు చేసి , దర్శించుకున్న ఋగ్వేదం లోగల 10-81,82 విశ్వకర్మ మంత్రం దేవతలకు ప్రజలందరికీ ఉపదేశించి, ఆ రోజునే విశ్వకర్మ వ్రతము యాగము , చేయడము ప్రారంభించడము జరింగింది .
భౌన ఋషి ఒక చక్ర వర్తి వారు దేవతసహిత మానవ రాజ్యాన్ని పరిపాలించారు అని , అనగా సత్య యుగం లో వేరే లోకాలు లేవని, విశేషంగా శ్రీ శ్రీ ఆచార్య మోహనరావు శర్మ గారు తమదైన శైలి లో భోధన చేశారు.
కన్యా సంక్రమణంలో ఈ భౌన విశ్వా కర్మ మంత్రం ప్రసన్నం చేసుకున్న రోజును , శుభ దినంగా పరిగణించి అందరూ కూడా , విశ్వా కర్మ వ్రతం చేయడం ఆనవాయితీగా వచ్చింది, ఈ నేపధ్యమే కాల క్రమేణా , ప్రస్తుతం , విశ్వా కర్మ జయంతిగా మారింది .
నిజానికి మనము చేయవలసింది విశ్వకర్మ వ్రతం, మరియు యాగము (యజ్ఞ మహోత్సవము) జయంతి కాదు అను నొక్కి వక్కాణించి చెప్పారు.
Note: please Comment Here for UPDATES and CORRECTIONS
Donate. Buy Us Coffee
Why news media is in crisis & How you can fix it.
India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here
Donate. https://mydigitalnews.in/donate
NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in or mydigitalnews.in@gmail.com or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register
Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.
Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.
What's Your Reaction?






