రామ మందిరానికి ధన సహాయం చేయటం ఎలా ?
how to donate to Ram Janma Bhumi temple trust, Telugu , ram mandir donation Telugu official
రామ మందిరానికి ధన సహాయం చేయటం ఎలా ?
అయోధ్యలో రామ్ మందిరాన్ని నిర్మించడానికి శ్రీ రామ్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020 ఫిబ్రవరి 5 న పీఎం మోడీ లోక్సభలో ఇదే విషయాన్ని ప్రకటించారు.
#Cabinet has today given approval to proposal for creation of 'Shri Ram Janma Bhoomi Tirtha Kshetra' trust
The Trust will be free to take all decisions regarding creation of a magnificent #RamTemple in #Ayodhya: PM @narendramodi#cabinetdecisions pic.twitter.com/dYoGZT0yKr — PIB India (@PIB_India) February 5, 2020
దేవాలయ నిర్మాణంలో ఉపయోగం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు వెండి ఇటుకలను పంపుతున్నారు. మనకు ఇప్పుడు చాలా వెండి ఇటుకలు ఉన్నాయి, వాటిని ఎలా సురక్షితమైన నిల్వలో ఉంచుకోవాలో మనం తీవ్రంగా ఆలోచించాలి ”అని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా ThePrint కి చెప్పారు. (Source :- https://theprint.in/india/dont-donate-silver-bricks-ram-mandir-trust-tells-donors-as-bank-lockers-run-out-of-space/606065/)
"అందువల్ల, ట్రస్ట్ ఇప్పుడు వెండిని దానం చేయవద్దని దాతలకు విజ్ఞప్తి చేస్తోంది."
శ్రీరాముడి జన్మ స్థానమైన అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ శ్రీరామ్ జన్మభూమి మందిర్ నిర్మాణానికి విరాళాల సేకరణ కూడా జరుగుతోంది. కోట్లాది మంది రామ భక్తులు ఎలా అయితే రామ జన్మభూమి కోసం పోరాటం చేశారో.. అలాగే రాముడి మందిరం నిర్మించడానికి కూడా సాయం చేయాలని ట్రస్ట్ ఇప్పటికే కోరింది. ఈ మందిరం నిర్మాణంలో సామాన్య ప్రజలను కూడా భాగం చేసేందుకు ఈ విరాళాల సేకరణను దేశ వ్యాప్తంగా మొదలుపెట్టింది.
‘‘ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. ఆయన చూపించిన సహనం, శాంతి, త్యాగం, శౌర్యం ప్రజలకు ఆదర్శం. ఈ దేశం ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎన్ని దాడులు ఎదుర్కొన్నా బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరామచంద్రుడు ఏర్పరిచిన దారి వల్లే. పరమత సహనాన్ని పాటిస్తూ.. అన్ని మతాలను స్వీకరిస్తూ ఈరోజు భారతదేశం ఇంత దృఢంగా ఉందంటే దానికి కారణం రామచంద్రుడు ఏర్పరిచిన దారే. అందుకే మనది రామరాజ్యం అంటాం.
ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో రామాలయం కడుతుంటే ప్రతి ఒక్క భారతీయుడు విరాళం ఇచ్చి సహకరించాలి.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఆ మతం, ఈ మతం అని తేడా లేకుండా అన్ని మతాలకు చెందిన ప్రజలు రామాలయం నిర్మాణం కోసం తమ వంతు సాయం అందజేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు చెందిన ఓ ముస్లిం కుటుంబం రామాలయ నిర్మాణానికి తమ వంతు సాయంగా విరాళాలు అందజేసింది. ఫైజాబాద్లోని రామ్ భవన్లో సంబంధిత విరాళం సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా రామ్ భవన్ నిర్వాహకులు సదరు ముస్లిం కుటుంబ సభ్యులను సన్మానించారు. వారిని అభినందించారు. కాగా, ‘మనమంతా హిందుస్థానీలం. మన మతాలు వేరు కావొచ్చు కానీ, మన ప్రాంతాలు వేరు కాదు. బయటి దేశం నుండి ఏం రాలేదు. మన పూర్వీకులు ఈ గడ్డపైనే పుట్టారు. హిందూ, ముస్లింలు అంతా సోదరభావంగా కలిసి మెలసి ఉన్నాం’ అని విరాళం ఇచ్చిన ముస్లిం కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, బెంగళూరులోనూ కొందరు క్రైస్తవులు అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం భారీగా విరాళాలు ఇచ్చారు. క్రైస్తవ సముదాయానికి చెందిన పారిశ్రామికవేత్తలు, విద్యా నిపుణులు రూ. కోటి విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణకు అందజేశారు.
ధన సహాయం ఎలా చేయాలి :-
రామ్ మందిరానికి విరాళం ఎంపికలు
పౌరులు వివిధ పద్ధతులను ఉపయోగించి ఆన్లైన్లో డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు. అంతేకాకుండా, ఎస్బిఐ, పిఎన్బి మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు చెక్, ఫండ్ ట్రాన్స్ఫర్ మరియు యుపిఐ ద్వారా విరాళ ఎంపికలను అందించాయి.
ఇక్కడ నొక్కండి ;- Click here (https://srjbtkshetra.org/donation-options/)
అధికారిక లింక్ పైన ఇవ్వబడినది, దీని ద్వారా ఎవరికి వారు తగిన రీతి లో ధన సహాయం(దానం) చేసుకోవచ్చును,
Devotees can make donations for the construction of the sacred Ram Temple by logging on to the following website: https://srjbtkshetra.org/donation-options/
ఇంతే కాకుండా , మీకు స్థానిక RSS వారు కానీ , VHP వారు కానీ పరిచయం ఉంటె వారిని అడగండి , వారు మీకు పూర్తి స్థాయి లో సహకరిస్తారు,
మందిరం నమూనా చిత్రం
Sri ram janma bhoomi threeth kshethra image
(( గమనిక :- * కేంద్ర ప్రభుత్వం “శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర” (పాన్: AAZTS6197B) ను చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంగా మరియు ఎఫ్.వై సంవత్సరం నుండి ఈ విభాగం యొక్క ప్రయోజనాల కోసం ప్రఖ్యాత ప్రజా ఆరాధన ప్రదేశంగా ప్రకటించింది. 2020-2021, vide (CBDT నోటిఫికేషన్ నం. 24/2020 / F. నం. 176/8/2017 / ITA-I).
* మందిర స్వచ్ఛంద సహకారం 50%, మందిరాన్ని పునరుద్ధరించడం / మరమ్మత్తు చేయడం కోసం, శ్రీ రామ్ జనభూమి తీర్థ్ క్షేత్రానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 జి కింద పేర్కొన్న ఇతర షరతులకు లోబడి, సెకండ్ 80 జి (2) (బి) కింద తగ్గింపుకు అర్హులు. , 1961. vide (CBDT నోటిఫికేషన్ నం. 24/2020 / F. నం. 176/8/2017 / ITA-I).
* రూ. 2,000 మినహాయింపుగా అనుమతించబడదు. ))
మరిన్ని వివరాలకోసం అధికారిక వెబ్సైటు ను చూడగలరు
What's Your Reaction?